NLG: చింతపల్లి మండలం మోదుగుల మల్లేపల్లిలో నిర్మించ తలపెట్టిన శ్రీ కూర్మాచల సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యానాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.