NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం ‘డ్రగ్స్ రహిత ముప్కాల్’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ పాల్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు అందించి బాధ్యతగా మెలగాలని కోరారు. మాదకద్రవ్యాల లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.