NRML: నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ కేజీబీవీ పాఠశాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.