SRPT: గరిడేపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో మర్రికుంట వద్ద సాగర ప్రధాన ఎడమ కాల్వ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. దీని నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో చిన్న చిన్న మరమ్మతులు చేసి వదిలేశారు.