BDK: మధిర మండలం మడుపల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజారావు, పుల్లయ్య పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.