SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం, పత్యా నాయక్ తండ గ్రామాల్లో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చినట్లు పశువైద్యాధికారి డాక్టర్ జెస్సీ క్రాంతి తెలిపారు. ఈ మేరకు పశువులకు సాధారణ వైద్యం చికిత్సలు, సీజనల్ వారీగా వ్యాపించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ పాటిల్ సిబ్బంది ఉన్నారు.