WNP: కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి సమస్యను పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జబ్బార్ ఆరోపించారు. మదనాపురం మండలంలోని అజ్జకొల్లు, తిరుమలాయపల్లి గ్రామాల్లోని వరి పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని సాగునీరు అందించడంలో విఫలమైందన్నారు.