SRD: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు ఆర్. సత్యనారాయణను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. సంగారెడ్డిలోని వారి నివాసానికి వెళ్లి సత్యనారాయణ యోగక్షేమాలు, అందిస్తున్న చికిత్స గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.