NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లో పేర్కొన్నారు. ఈ పీటీషన్లను కోర్టు ఈరోజు విచారించనుంది. దీంతో వెల్దండ మండలంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.