వరంగల్: సీఎం కప్-2024’లో భాగంగా ఈ నెల 27 నుంచి 30 వరకు వరంగల్ ఓసిటీ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి కోరారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.