MBNR: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అందరి సమస్యలు పరిష్కరిస్తారని, మీ డిమాండ్లలో న్యాయం ఉందని వాటిని పరిష్కరించడానికి ఈనెల 29న సీఎంతో భేటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.