KMM: గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొణిజర్ల (మం) మునగాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును తనిఖీ చేసి, భూ సమస్యలకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూ భారతితో సమస్యలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.