HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సమీపంలోని కాథలిక్ సమాధి ప్రాంగణం వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆధార్ కార్డు ఆధారంగా అతను ఏలూరు జిల్లా భీమడోలు నివాసి మున్నంగి కోటిరెడ్డి (60)గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధికులు పోలీసులను సంప్రదించాలని కోరారు.