SDPT: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య అన్నారు. శుక్రవారం దుబ్బాక లోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు.