KMM: చంద్రగ్రహణం ముగియడంతో కూసుమంచి మండలం జీళ్ళచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. పూజారి చిలకమర్రి స్వామినాథాచార్యులు ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.