MBNR: అనారోగ్యంతో పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని నవాబ్పేట మండలంలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. షాద్నగర్లో చదువుతున్న ఆమె గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై విక్రం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టుతున్నారు.