MNCL: మంచిర్యాలలోని గాంధీనగర్లో నూతనంగా నిర్వహించిన శ్రీ కాళీమాత అష్ట కాలభైరవ గణపతి దేవాలయాన్ని ఆదివారం అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అస్సాం కామాఖ్య ఆలయానికి చెందిన అఘోరి రఘు స్వామి, మధురై అఘోరి బాలస్వామి జలధి వాసం నుంచి వచ్చి గర్భగుడిలో విగ్రహాల ప్రతిష్టాపన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు.