NLG: కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో ఈనెల 24, 25, తేదీల్లో జరిగే శ్రీ ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి ముత్యాలమ్మ పండగకు రావాలని కోరారు.