NRML: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 256.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో అత్యధికంగా సారంగాపూర్లో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, లోకేశ్వరంలో 31, నర్సాపూర్ & నిర్మల్లో 27, ఖానాపూర్లో 20, మామడలో 18 మిల్లీమీటర్ల, అత్యల్పంగా బాసరలో 3.2 మీ. మీటర్ల వర్షం నమోదయినట్లు అధికారులు తెలిపారు.