వనపర్తిలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ కాలనీకి చెందిన మహేష్ (42) హమాలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చేసిన అన్వేషణ ఫలించకపోవడంతో భార్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.