BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు తగ్గంటూ.. ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో జి.రవి నాయక్ తెలిపారు. మంగళవారం దేవస్థానంతో పాటు కొండ కింద సత్యనారాయణ వ్రత మండపాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతోపాటు ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.