SRD: ఖాజీపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 181లోని ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించినా, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.