NLG: ‘భూ భారతి చట్టం రైతుల చుట్టం’ అని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భూములకు రక్షణ కవచం లాగా ఉండాలనే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకోవచ్చిందన్నారు.