ADB: మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివాసి తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. పట్టణంలోని కొమరం భీం కాలనీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు మోహన్ బాబు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆయనే ఖర్చులు భరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.