BDK: ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ప్రజాస్వామ్య కోణానికి విరుద్ధంగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సింగరాయపాలెంలో జరిగిన సీపీఎం పార్టీ డివిజన్ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల బతుకులు బాగుపడాలంటే పాలకుల ఆలోచన బాగుండాలని ఆయన పేర్కొన్నారు.