SRD: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం ఫల పరిశోధన కేంద్రంలోని ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ మాధురి శనివారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ది కీలక పాత్ర అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, అధికారులు పాల్గొన్నారు.