KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు శ్రీపుష్పయాగం సందర్భంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్, ధర్మకర్తలు తెలిపారు. భక్తులకు విద్యుత్, నీటి వనరులను కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.