KMR: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ తిరుమల ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి కాకుండా భక్తులు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇక్కడికి తరలివస్తారని చెప్పారు.