SRPT: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం అనంతగిరి మండలంలోని కొత్తగోల్ తండా గ్రామంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి, కోదాడ నియోజకవర్గ గిరిజన మోర్చా అసెంబ్లీ నియోజవర్గ కన్వీనర్ బాణోతు అనుషా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.