KMM: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈనెల 13 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ 10 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయాలని సూచించారు.