సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగీతం శ్రీనివాస్ను పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం శ్రీనివాస్ను శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మొర రవి, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, క్యాషియర్ యెల్లె శ్రీనివాస్, వార్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.