BDK: మణుగూరు వలస ఆదివాసి గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో వైద్యులు మంగళవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గృహ సందర్శన చేసి మలేరియా, డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, గుంతల్లో దోమ లార్వాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డా. నిశాంత్ రావు, సబ్ యూనిట్ ఆఫీసర్ పాల్గొన్నారు.