MDK: తూప్రాన్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తనిఖీ చేశారు. బుధవారం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, కిష్టాపూర్ గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పోలీసులకు, అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, తూప్రాన్ ఎస్సై శివానందం పాల్గొన్నారు.