WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో డిసెంబర్ 8న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శుక్రవారం రేవల్లిలో మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు.