HNK: పాఠశాల రెన్యువల్ కోసం రూ. లక్ష డిమాండ్ చేసిన అదనపు కలెక్టర్, ఇంఛార్జ్ డీఈవో వెంకటరెడ్డి, సిబ్బంది గౌస్, మనోజ్ను పట్టుకోవడానికి బాధితుడే తమకు సమాచారం ఇచ్చారని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. రూ.60,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.