MDK: సదాశివపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన మార్గం నర్సమ్మ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆమె భర్త మార్గం సత్తయ్య పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద విగత జీవిగా కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.