వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్ ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 2022లో నెదర్లాండ్స్పై ఇంగ్లండ్ 498 పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు అమెరికా జూనియర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా భారీ తేడాతో గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఓ మహిళా క్రీడాకారిణి పట్ల మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. మేసెజ్ చేసి, పర్సనల్ ఫోటోలు పంపాలని కోరాడు. మహిళ తరఫు బంధువు నిలదీయడంతో కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ప్రపంచ ఆసియా కప్లో భాగంగా ఇండియన్ టీమ్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఉత్తీర్ణులైన వారికి తుది జట్టులో స్థానం ఉంటుంది.
విండీస్ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నామని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. మరింత మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.
చెన్నైలో శనివారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asia Hockey Champions Trophy 2023) ఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో మలేషియాను 4-3 తేడాతో ఓడించి భారత్ గెలిచింది.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) పలు టెస్ట్లు నిర్వహించింది. అందులో అత్యధికంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మూడుసార్లు డోప్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.