భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి నేటితో 35 ఏళ్లు. ఈ వయసులోనే అనేక రికార్డులను అధిగమించాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం బీట్ చేశాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తన గురించి పలు కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠతో కూడిన మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. అంతేకాదు ఈరోజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు అయిన నేపథ్యంలో కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్
వర్షం కారణంగా బెంగళూరులో జరిగిన న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచులో అనుహ్యాంగా డీఎల్ఎస్ పద్ధతిలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 401 పరుగులు చేసినప్పటికీ చివరకి ఇలా జరగడం పట్ల కివీస్ అభిమానులు నిరాశ చెందారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో నేడు న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర(Rachin Ravindra) సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 35వ మ్యాచులో ఈ ఘనతను సాధించాడు. అయితే అతని వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
వన్డే ప్రపంచకప్లో భాగంగా నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కీలక మ్యాచ్లో పాకిస్థాన్ ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది.
ఆసీస్, కివీస్ మ్యాచ్లు గెలిస్తే.. ఆ రెండు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి. టోర్నీ నుంచి పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లిపోతాయి.
వన్డే ప్రపంచ కప్ 2023లో సెమీ ఫైనల్ అర్హత కోసం జరిగిన పోటీలో ఆప్గానిస్తాన్ జట్టు నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు సెమీస్ ఆశలను మరింత కఠినం చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుతం ఆప్గాన్ జట్టు న్యూజిలాండ్ తో సమానంగా పాయింట్ల పట్టికలో ఉండటం విశేషం.
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
2023 ప్రపంచ కప్ సెమీఫైనల్కు వెళ్లే క్రమంలో భారత జట్టు కీలకమైన జైత్ర యాత్రను కొనసాగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 మ్యాచులు వరుసగా గెల్చి అద్భుతమైన రికార్డు సాధించింది. తాజాగా శ్రీలంక జట్టుపై 302 పరుగుల తేడాతో గెలుపొందింది.
నేడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 33వ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు మిస్సయ్యాయి. అయితే ముందుగా శుభ్మాన్ గిల్ తన ఏడో వన్డే సెంచరీ చేసేందుకు ముందు 92 రన్స్ వద్ద ఔట్ కాగా..సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
ఈరోజు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ ఛేజ్ చేస్తాడని అనుకుంటే..అది పూర్తి కాకుండానే ఔట్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన ఇన్నింగ్స్లో టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును విరాట్ సమం చేయాలని అభిమానులు ఆత్రుతగా చూడగా అది ఈరోజు సఫలం కాలేదు.
వరల్డ్ కప్లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.