ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. నటులు విక్టరీ వెంకటేశ్, ఆర్య హుషారుగా పాల్గొన్నారు.
కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan Royals)..సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
హైదరాబాద్లో(Hyderabad) ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్(Uppal)లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ (IPL) మ్యాచ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్పై(Delhi Capitals)..లఖ్నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్లో 16వ సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 ...
మొహాలీలో (Mohali) భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్కి మొదటి మ్యాచ్లో విజయం వరించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్(Duckworth Lewis) విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా (Kolkata) 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అం...
హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
MS Dhoni : ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివర ఆఖరికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. చెన్నై పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే... ఈమ్యాచ్ లో సరికొత్త రికార్డు సాధించారు.
ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్లో బోణీ కొట్టి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియన్ సన్ జట్టుకు దూరం అవనున్నారు. నిన్నటి మ్యాచ్లో బాల్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే.