సౌతాఫ్రికాతో నేడు జరిగే రెండో టీ20లో కూడా సంజూ శాంసన్కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఎలాంటి మార్పులు లేకుండా, గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే టీమిండియా ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్గా జితేశ్ శర్మకు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. అయితే.. గిల్, కెప్టెన్ సూర్య ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది.