జమ్మూకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్ నుంచి భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన జైషే మహ్మద్ ఉగ్రవాదిని BSF అరెస్ట్ చేసింది. అతను అబ్దుల్ ఖాలిక్గా గుర్తించారు. పూంచ్, రాజౌరిల్లో ఉన్న ఉగ్ర సంస్థకు ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పని చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. పాక్లో కొన్నేళ్లుగా శిక్షణ పొందిన తర్వాత దేశంలోకి వస్తుండగా.. అతడిని పట్టుకున్నారు.