భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. భారత బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (39), శుభ్మన్ గిల్ (37) దూకుడుగా ఆడుతున్న తరుణంలో వరుణుడు ఆటకు అడ్డుపడ్డాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి, భారత్ 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.