టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్గా జడ్డూ చరిత్ర సృష్టించాడు. గౌహతి వేదికగా ఉదయం సెషల్లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.