విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో మరో పరుగు చేస్తే.. లిస్ట్-ఏ క్రికెట్లో 16వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.