సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 30 సీట్లను సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని అన్నారు. మోదీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ కు వణుకు పుడుతుందన్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీకి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. గతంలో కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం అతని మరణంతో రాజు భార్య శ్యామలా దేవి(shyamala devi) త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ శుక్రవారం తెలిపారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన వెల్లడించారు.
హైద్రాబాద్ (Hyderabad) ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) ప్రధానిమోదీకి (PM Modi) ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఏలూరును రెండు మండలాలుగా ఏపీ సర్కార్ విభజించింది. ఏలూరు అర్భన్, ఏలూరు రూరల్ మండలాలుగా రెవెన్యూ గ్రామాలు కొనసాగనున్నాయి. ఇందులో రూరల్ పరిధిలోకి 13, అర్భన్ లో 8 కొనసాగనున్నాయి.