తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో కూడా అందరూ ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్డీవో వ్యవస్థను కూడా రద్దు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందట. దీనికి సంబంధించి కొద్దీ రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ట్రోల్స్ చేస్తోంది. లాయర్లకు ఇచ్చే ఫీజుల విషయం గురించి విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలను టీడీపీ ట్రోల్స్ చేయడం చర్చనీయాంశమైంది.
చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ చేసేవి మాత్రం అందుకు విరుద్దం అంటున్నారు తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మొద్దని ప్లకార్డు పట్టుకొని కేటీఆర్ ఆందోళన చేసిన పిక్ ఒకటి షేర్ చేశారు.
టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ తెలంగాణలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తమ మామ చంద్రశేఖర్ రెడ్డి కోసం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున బన్నీ ప్రచారం చేపట్టనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
పుంగనూర్ ఘర్షణకు కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీడీపీ నేతలు అంటున్నారు. అతనిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కలిసి విన్నవించారు.
తెలంగాణలో వర్షాల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్(KCR) మాత్రం మహారాష్ట్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో వేల ఎకరాలు భూకబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పాలని రేవంత్ అన్నారు.
పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.