తెలంగాణలో గృహలక్ష్మి స్కీం ప్రకటించారు. కానీ అప్లై చేసిన తర్వాత కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదని అప్లై చేసిన వారు అంటున్నారు. దరఖాస్తులను కుప్పలుగా పెడుతున్నారు తప్ప వాటిని ఆన్ లైన్లో కూడా నమోదు చేయడం లేదని వాపోతున్నారు. ఇలాంటి క్రమంలో అసలు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మబలిదానాలపై ఏర్పిడిన తెలంగాణ ప్రస్తుతం కేసీఆర్ చేతిలో దోపిడికి గురైందని బీజేపీ రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్(tarun chugh) వ్యాఖ్యానించారు. ప్రతి పనిలో కేసీర్ భారీగా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు..
విపక్ష కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఏపీ రాజకీయాలపై, జనసేన అధినేత పవన్పై నటి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలను రాజకీయాల్లో లాగొద్దని సూచించారు. రాజకీయ పరంగా తన సపోర్ట్ పవన్కే ఉంటుందని ఆమె తెలిపారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసుకోవడం ఆపాలని సూచించారు.
రాష్ట్రంలో గ్రూప్ 2(group2) ఎగ్జామ్(exam) వాయిదా వేయాలని ఉద్యోగార్థులు TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. గురుకుల పరీక్షలు ఉన్న షెడ్యూల్లోనే ఈ ఎగ్జామ్ కూడా నిర్వహించడం సరికాదన్నారు. దీంతోపాటు పేపర్ లీకేజీ కారణంగా తమ సమయం వృథా అయ్యిందని ఈ నేపథ్యంలో ఎగ్జామ్ మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని అంటే ఊరుకునేది లేదన్నారు. తమ్ముడికి సలహాలు ఇచ్చి బాగుచేయాలన్నారు. సినిమా ఫంక్షన్లలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడ్డం మంచి పద్దతి కాదన్నారు.
మణిపూర్లో భారతమాతను చంపెశారు అన్న రాహుల్ గాంధీ మాటలపై సృతీ ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతికి మారుపేరన్నారు. ఎమర్జెన్సీ నాటీ పరిస్థితులను గుర్తు చేశారు.
పార్లమెంటు(parliament)లో మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజున రాహుల్ గాంధీ(rahul gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భారతమాతకు రక్షకులు కాదని, భారతమాతను చంపిన హంతకులని వ్యాఖ్యలు చేశారు.
బతుకంతా పోరాటం, అణగారిన ప్రజలకై నిత్యం ఆరాటం ఇదే ప్రజాగాయకుడు గద్దర్ ప్రస్థానం. ఆయన ఎమ్మెల్యే కావాలని కలగన్నాడు. కాలం వేరే కథ రాసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కొడుక్కు జాతీయ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.