ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...
తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింద...
మునుగోడు ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆ పార్టీ అధిష్టానం కోపంగా ఉంది. మునుగోడులో ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవదని కామెంట్లు చేయడం, దీనికి తోడు.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించమని ఫోన్లలో మాట్లాడటం వంటి చర్యల పట్ల పార్టీ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే..తాజాగా తెలంగాణ కా...
త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేం...
తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇం...
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమని, ఈ రెండు పార్టీలకు త్వరలో మూడో పార్టీ కూడా కలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావమే లేకుంటే, సొంత పేపర్లో అధికార పార్టీ అలా అక్కసు వెళ్లగక్కదన్నారు. ఈ రెండు పార్టీల కలయికతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతోందని, ఆ పార్టీలకు నిజంగానే బలం లేకుంటే జగన్ ప్రభుత్వానికి తత్తరపాటు అవసరం లేదన్నారు. చంద్రబాబ...
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఏపీ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయనపై భూ కబ్జా అని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని స్పష్టంచేశారు. అలాంటిది భూములు ఆక్ర...
రాజకీయ ముఖ్య నేతలను సినీ ప్రముఖులు వరసగా కలుస్తున్నారు. నిన్న చంద్రబాబుతో రజనీకాంత్ మీట్ కాగా.. ఇవాళ లోకేశ్తో తారకరత్న సమావేశం అయ్యారు. వరసకు బావ బావమరుదులు కానీ.. పార్టీ విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు మరో ఏడాదిన్నరలో ఏపీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో లోకేశ్ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో కూడా ఇద...
బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగానే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. అధికార మదం, అధికార గర్వం, ఆవేదన చెందితే టార్గెట్ చేస్తారా, పదవి ...
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే రియాక్షన్స్ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా రేణుకా చౌదరి విమర్శలు స్టార్ట్ చేశారు. ఖమ్మంలో అడుగుపెట్టే నైతిక అర్హత కేసీఆర్కు లేదని చెప్పా...
కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవస...
ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజ...
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ అని మాట్లాడారు. సునీల్ విచారణ, అందులో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ వెంటనే మల్లు రవి మాట మార్చేశారు. తనకేం తెలియదని నమ్మబలికే...