ప్రజా పాలనపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్కాంత్ అనారోగ్యం కారణంగా ఈరోజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విజయ్కాంత్ పార్థివదేహాన్ని చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భట్టి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపింది.
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిసి నిధుల గురించి వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు.
సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా పీకే-25 స్థానానికి సవీరా ప్రకాశ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ విజయం సాధించాలని చూస్తుంది. ఈక్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
రైతులు రుణ మాఫీకి సంబంధించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడినందుకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.