ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.
Cm kcr:సీఎం కేసీఆర్ (Cm kcr) రేపు కరీంనగర్ (karimnagar) జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించి అధికారులు నివేదిక సిద్దం చేసిన సంగతి తెలిసిందే.
Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ను కలిశారు.
Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు.
Tspsc is the xerox centre:పేపర్ లీకేజీతో టీఎస్ పీఎస్సీపై (Tspsc) రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు వెలిసిన ఓ పోస్టర్ (poster) మాత్రం కలకలం రేపుతోంది. అందులో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ (xerox) అని రాసి ఉంది. ఇక్కడ అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని క్యాప్షన్ కూడా పెట్టారు.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంప...
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడ...